వైసీపీ గెలుస్తుందని 30కోట్లు బెట్టింగ్ పెట్టి..కట్టలేక…?

 వైసీపీ గెలుస్తుందని 30కోట్లు బెట్టింగ్ పెట్టి..కట్టలేక…?

31 total views , 1 views today

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని రాష్ట్రంలోని ఏలూరు జిల్లా తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అన్ వ్యక్తి పలువురితో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టాడు.

అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164స్థానాలు.. వైసీపీ పదకొండు స్థానాల్లోనే మాత్రమే గెలుపొందింది. దీంతో వైసీపీ ఓడిపోవడంతో వేణు గోపాల్ రెడ్డి తన ఊరు.. ఇల్లు విడిచి వెళ్లిపోయాడు..

అతనికి ఎంతగా  ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పందెం వేసినవారు ఇంటికి వచ్చి అతనింటిలోని ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లారు.

ఆ తర్వాతరోజు ఇంటికొచ్చిన వేణుగోపాల్ మనస్తాపానికి గురయ్యాడు. నిన్న ఆదివారం తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400