కాంగ్రెస్ లో చేరికపై ఎంపీ కేకే కీలక ప్రకటన

 కాంగ్రెస్ లో చేరికపై ఎంపీ కేకే కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర పధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు చెందిన సెక్రటరీ జనరల్.. రాజ్యసభ సభ్యుడు కే కేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ” నాకు కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు లాంటిది.

తీర్థ యాత్రలకు వెళ్లిన ఎవరైన సరే తిరిగి తమ సొంత ఇంటికి చేరుతారు. నేను కూడా తీర్థ యాత్రలకు బీఆర్ఎస్ పార్టీలో చేరాను. బీఆర్ఎస్ లో నేను కేవలం పదేండ్లు మాత్రమే ఉన్నను. నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్ లోనే. నేను కాంగ్రెస్ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నాను.

ప్రస్తుతానికైతే నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. త్వరలోనే ఆ తారీఖు చెప్తాను. నా కుమార్తె మాత్రం రేపు శనివారం కాంగ్రెస్ లో చేరతారు. నా కుమారుడు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉంటారని” అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *