రేవంత్ రెడ్డికి కేటీఆరే టార్గెట్ ఎందుకు…?

Why is KTR a target for Revanth Reddy?
2 total views , 1 views today
గతంలో అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఓ ప్రయివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు. కేటీఆర్పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనుమతితో తదుపరి చర్యలకు కాంగ్రెస్ సర్కార్ ఉపక్రమించింది.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్పై అభియోగం మోపారు. కేటీఆర్పై 4 సెక్షన్లు.. 13(1)A, 13(2)పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేసింది ఏసీబీ.ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ ఎందుకని బీఆర్ఎస్ ఓ వీడియో విడుదల చేసింది. మీరు ఓ లుక్ వేయండి.
