జగన్ పై వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు

Vasireddy Padma Shocking Comments On Jagan
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళ నాయకురాలు.. మహిళా కమీషన్ మాజీ చైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ ఐదేండ్ల వైసీపీ పాలనలో మహిళలపై రోజుకో సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు ఇలాంటి సంఘటనలు బయటకు రాకుండా తొక్కిపట్టారు. మహిళా కమీషన్ చైర్ పర్శన్ గా ఉన్న నాకే ఫ్రీఢమ్ లేదు.
మహిళలను రాజకీయంగా వాడుకున్నారు. పార్టీని నడపటం చేతకాలేదు.. మహిళల విషయంలో ఇప్పుడు జగన్ రాజకీయం చేస్తున్నారు. మహిళ నాయకులకు.. మహిళలకు జగన్ విలువ ఇవ్వలేదు. సంక్షేమం పేరుతో లక్ష కోట్ల ను దోచుకున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
