రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే బిగ్ షాకిచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహాన్ రెడ్డి సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.
కావాలనే కొన్ని మీడియా సంస్థలు.. సోషల్ మీడియాలో నేనంటే గిట్టనివాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. మీడియాలో.. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై సైతం నేను పార్టీ మారలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇదే ఏడాది 2025 ఫిబ్రవరి 11న గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను.
దాని ఆధా రంగా బీఎన్ఎస్ కింద ఎఫ్ఎఆర్ కూడా నమోదైందని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు.. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని కొందరు వ్యక్తులు మోసపూరితంగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. వాటి ఆధారంగా తనకు వ్యతిరేకంగా అనర్హత పిటి షన్ దాఖలు చేశారని ఎమ్మెల్యే సుప్రీం కోర్టుకు తెలిపారు. తాను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోలేదు.. అందువల్ల పిటిష నన్ను కొట్టివేయాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు.
