రైతుభరోసా ఇవ్వలేమంటున్న మంత్రి

Farmer insurance cut for them..?
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుభరోసా పథకంపై క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని వచ్చే రబీ సీజన్ నుండి అమలు చేస్తాము..
ప్రతి ఎకరాకు రూ.7500లు ఇస్తామని తెలిపారు. అంటే ఈ సీజన్ కు రైతుభరోసా డబ్బులివ్వలేము అని చేతులేత్తేశారన్నమాట.
ఇదే అంశంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ మాటలు ఇవ్వడం.. మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికైన రైతులు ఎవరూ తమకు మంచి చేస్తారు.. ఎవరూ తమకు అన్యాయం చేస్తారో ఆలోచించాలని హితవు పలికారు.
