కూటమి పాలనకు నేటితో ఏడాది.

The coalition government has been in power for a year now.
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తి చేసుకున్నది.
గత ఏడాది ఇదే నెల ఇదే తారీఖున జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. మరోవైపు అప్పటి అధికార పార్టీ వైసీపీ ఒంటరిగా రంగంలోకి దిగింది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 సీట్లకు గానూ 164స్థానాల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది.
టీడీపీ 135, జనసేన 21, బీజేపీ8, వైసీపీ 11 చోట్ల విజయఢంకా మ్రోగించింది. అయితే, జనసేన పోటి చేసిన అన్ని చోట్ల గెలుపొంది వంద శాతం స్ట్రైక్ రేటును నమోదు చేసింది.
