తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఆ ముగ్గురికి చోటు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలవుతున్న ఇంతవరకూ పూర్తిస్థాయి క్యాబినెట్ లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక పన్నెండు మందితో క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేశారు.
తాజాగా మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ జాతీయ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు ఆదివారం రాజ్ భవన్ లో మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గాంధీభవన్ లో గుసగుసలు విన్పిస్తోన్నాయి.
ఆ ముగ్గురిలో ఎస్సీ సామాజికవర్గం నుండి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డి, ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహారి ముదిరాజు లకు చోటు దక్కినట్లు టాక్. ఇప్పటికే వీళ్లకు రాజ్ భవన్ నుండి సమాచారం వెళ్లినట్లు సమాచారం.
