దసరా నుంచి ప్రతి రైతుకు రైతు భరోసా

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.సోమవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఏర్పాటుచేసిన మహాలక్ష్మి పథకం రాయితీ సిలిండర్ల ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు దృపత్రాలను అందజేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 10 సంవత్సరాల BRS ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కావలసిన చర్యలు చేపడుతూనే ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందజేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఉచిత విద్యుత్ రాయితీ సిలిండర్ల పంపిణీ10 లక్షల ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ లను అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల అభివృద్ధిని ధ్యేయంగా భావించిన రేవంత్ రెడ్డి సర్కార్ మహిళా సంఘాల బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారుపాఠశాల విద్యార్థుల దుస్తుల తయారీ పావలా వడ్డీ రుణాలు, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ఆర్టీసీ బస్సులలో సైతం మహిళలను భాగస్వామ్యం చేస్తుందని, ఐదేళ్లలో కోటి మంది మహిళలు కోటీశ్వరులుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
దసరా నుంచి ప్రతి అన్నదాత అకౌంట్లో రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారుగ్రామాల్లోని ప్రతి సొంత ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు చేస్తామని ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే తయారు చేసి ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రతి ఒక్కరిని గెలిపించి తనకు అండగా నిలవాలని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మనిషి ప్రజాప్రతినిధుడిగా ఎన్నికైతే అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా నిరాటంకంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే సూచించారు. ఈకార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డు ఉపాధ్యక్షులు పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ వెల్టూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బాలచంద్రయ్య, పెద్దమందడి అడ్డాకుల మండలాల అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు..
