జగన్ కు ఆర్ఆర్ఆర్ విన్నపం

 జగన్ కు ఆర్ఆర్ఆర్ విన్నపం

ఏపీ అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈరోజు ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డికి తారసపడ్డారు..

ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు..అనంతరం ప్రతి రోజూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి..అవసరమైతే సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడి తన పక్కనే సభలో చైర్ వేయిస్తానని జగన్ కు చెప్పినట్లు మీడియాకు వెల్లడించారు..

ఆర్ఆర్ఆర్ మాటలకు జగన్ స్పందిస్తూ ప్రతి రోజూ క్రమం తప్పకుండా అసెంబ్లీకు వస్తాను..ప్రజా సమస్యలపై ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని నిలదీస్తాను..భయపడి పారిపోయే పరిస్థితులు లేవు..మున్ముందు నేను సభలో ఎలా ఉంటానో చూస్తారు అని బదులిచ్చారు అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *