యువహీరో తో రీతూ వర్మ రోమాన్స్

 యువహీరో తో రీతూ వర్మ రోమాన్స్

Ritu Varma

Loading

స్వాగ్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నటీ రీతూవర్మ. రీతూవర్మ తాజాగా పీపుల్స్ స్టార్ .. యువహీరో సందీప్ కిషన్ సరసన నటించనున్నట్లు తెలుస్తుంది. సందీప్ కిషన్ ల్యాండ్ మార్క్ మూవీ ముప్పై సినిమాగా మజాకా కి ధమాకా మేకర్స్ త్రినాధరావు నక్సిన దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ , హస్య మూవీస్ ,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎక్స్ ప్లోజింగ్ ఎంటర్ ట్రైనర్ షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది.

దాదాపు ఇరవై రోజుల షెడ్యూల్ లో యాక్షన్ బ్లాక్స్ తో పాటుగా ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నరు. రీతూ వర్మ హీరోయిన్ గా యువహీరోతో రోమాన్స్ చేయనున్నట్లు చిత్రం మేకర్స్ తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *