మహారాష్ట్ర ఓటర్ల చెవిలో రేవంత్ పూవ్వులు

 మహారాష్ట్ర ఓటర్ల చెవిలో రేవంత్ పూవ్వులు

Revanth Reddy

Loading

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మహారాష్ట్రలో తెలంగాణ తరహా పాలనను అందిస్తాము. తెలంగాణలో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేర్చాము.

మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి మార్కు పాలనను చూపిస్తాము అని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కౌంటరిస్తూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజల చెవిలో పూవులు పెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలను ఆటకెక్కించారు. ఆసరా నాలుగు వేలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల రూపాయలు ఇవ్వడానికే నానా కష్టాలు పడుతున్నారు.

రైతుభరోసా బంద్ పెట్టారు. రుణమాఫీ అడ్రసే లేకుండా చేశారు. నెలకు రెండున్నర వేలు ఇస్తామని ఆడబిడ్డలను మోసం చేశారు. గత పది నెలలుగా తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేశారు. ఇప్పుడు మహరాష్ట్ర ప్రజల చెవులో పూవులు పెడుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *