తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్

 తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్

BRS VS Congress

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలెట్టనున్నారు అని గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి.

హైదరాబాద్ మహానగరానికి చెందిన సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.. యూపీ మాజీ సీఎం ..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది.

రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరతారని సమాచారం. రేపు ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో తెలంగాణలో చేరికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగి రాగానే మంచి రోజు చూసుకుని తలసాని కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు గాంధీ భవన్ వర్గాల గుసగుసలు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *