65 లక్షల మంది కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

 65 లక్షల మంది కి  ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 లక్షల మంది కి 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా ఎన్డీఏ కూటమి రాష్ట్రా ప్రభుత్వం అందిస్తుంది అని చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ అన్నారు. రాష్ట్రంలోని తాడికలపూడి, యడవల్లి పంచాయితీలలో ఉన్న నల్లగోపువారిగూడెం, ఉప్పలపాడు, వీరిశెట్టిగూడెం, తడికలపూడి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను చింతలపూడి ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్, చింతలపూడి జనసేన ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పెన్షన్ మొత్తాన్ని 2 వేల నుండి 3 వేల రూపాయలకు పెంచడానికి గత ప్రభుత్వానికి 5 సంవత్సరాల సమయం పడితే తాము 10 రోజుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచామన్నారు.

ప్రతీ నెల మొదటి తేదీనే మొత్తం పెన్షనర్ల అందరికి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందించడం జరుగుతుందని, ఆ సమయంలో ఇంట్లో లేని వారికి 2వ తేదీన పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ కూటమి సభ్యులతో చారిత్రాత్మక విజయాన్ని అందించారని, ఆ విజయాన్ని బాధ్యతగా భావించి ప్రజల ఆకాంక్షల మేరకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *