వైసీపీ ఎంపీ కు భూకబ్జాపై నోటీసులు…!

Notices to YSRCP MP over land grabbing…!shot reply..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఆయన సోదరుడు మేడా మల్లిఖార్జున రెడ్డి లకు రాజాంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరు మండలం లేబాక గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా 109.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్ఎస్ఆర్ రికార్డుల్లో గయా భూములుగా వాటిని అక్రమించుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు.
ఎంపీ మేడా కుటుంబ సభ్యుల నుండి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని సంబంధించిన చర్యలను చేపట్టారు. సర్వే నంబరు 121-5లో ఉన్న 3.50 ఎకరాలను రఘునాథ రెడ్డి బాబాయి మేడా సుబ్బరామిరెడ్డి అక్రమించుకున్నారని ఆయనకు నోటీసులు జారీ చేశారు.
