మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ తాతా మధు భేటీ

 మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ తాతా మధు భేటీ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నిన్న శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత జూలూరు గౌరీ శంకర్ తెలంగాణ తల్లి పై రాసిన ‘అందరికీ అమ్మ’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.

కేసీఆర్ గారిని కలిసిన నేతల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు తాతా మధు, ఎం.సి. కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్లు బండ నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, గ్యాదరి కిషోర్ కుమార్, కందాల ఉపేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ ఉన్నారు.

పలువురు బీఆర్ఎస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, నర్సింహా రెడ్డి, పాల్వాయి స్రవంతి, రేగట్టే మల్లిగార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, పల్లె ప్రవీణ్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, వలమల కృష్ణ, నూకల యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *