మరోసారి మంత్రి కొండా సురేఖ టంగ్ స్లిప్ ..?

 మరోసారి మంత్రి కొండా సురేఖ టంగ్ స్లిప్ ..?

Konda Surekha

Loading

తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీమ్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై దాదాపు అరవై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత పాలైన సంగతి తెల్సిందే. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ నిన్న మంగళవారం నిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.

మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇటీవల దీపావళి తెచ్చుకున్న అప్పాలు . తినుబండరాలను తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు.. హాస్టల్ లో ముప్పై మంది విద్యార్థుల బ్యాగులను పరిశీలిస్తే అప్పాలు.. తినుబండరాలు దొరికాయని సెలవిచ్చారు. దీనిపై నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీ నేతలు స్పందిస్తూ ” దీపావళి పండుగ జరిగింది ముప్పై ఒకటో తారీఖు.. విద్యార్థులు ఫుడ్ ఫాయిజన్ కు గురైంది ముప్పై తారీఖు.

ఒకవేళ దీపావళి అప్పాలతోనే ఫుడ్ ఫాయిజన్ కు గురయ్యారనుకుందాం కాసేపు. మరి ఆ ఆరవై మంది తల్లిదండ్రులు అప్పాల వంటకు ఒకే రకమైన నూనె వాడారా..?. తెలివి ఉండే మాట్లాడుతున్నారా మంత్రిగారు..?. లేదా మీ ప్రభుత్వ వైపల్యాన్ని కప్పిపుచ్చడానికి ఇలా మాట్లాడుతున్నారా..?. మీడియా ను ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారా అని విమర్శల వర్షం కురిపిస్తున్నరు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *