జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే

 జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే

Loading

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల  విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఆ పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

జగన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ప్రతిపక్ష స్థాయిని కోరడం ప్రజాతీర్పును అవహేళన చేయడమేనన్నారు. ఈ విషయంలో లేనిపోని రాద్దాంతం చేయడం సరికాదన్నారు.

గాజువాకలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో పల్లా మాట్లాడారు. శాసనసభలో పదో వంతు ఎమ్మెల్యేలను గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుందని, కేవలం 11 స్థానాలు గెలిచిన జగన్‌.. శాసనసభలో ఫ్లోర్‌ లీడర్‌గా మాత్రమే కొనసాగాలని అసెంబ్లీ నిబంధనలు చెబుతున్నాయని చెప్పారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *