లడ్డూ వివాదంపై దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి

 లడ్డూ వివాదంపై దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి

RK ROJA Ap Former Minister

Loading

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దేవుడంటే భక్తి లేదు.. భయం లేదు అని అన్నారు వైసీపీ సీనియర్ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా. రోజా మీడియాతో మాట్లాడుతూ ” నాడు ఉమ్మడి ఏపీ నుండి నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పూజలు చేసే సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకునేవారు..

ఏదైన ప్రభుత్వ రంగ భవనం నిర్మాణం. అఖరికి బాబు మీడియా ఊకదంపుడు ప్రచారం చేసిన తాత్కాలిక రాజధానిలోని సచివాలయానికి హైకోర్టు పూజ కార్యక్రమాల సమయంలోనూ బాబు తన కాళ్లకు చెప్పులు వేసుకునే పాల్గోన్నారు.

బాబు ఇప్పుడు దేవుడి గురించి… దైవ భక్తి గురించి మాట్లాడుతున్నారా..?. అసలు బాబు ఎప్పుడైన తిరుమలలో గుండు కొట్టించుకున్నారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు.. లడ్డూ వివాదంపై సిట్ తో కాదు దమ్ముంటే సీబీఐ విచారణ చేయించు అని ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు కు సవాల్ విసిరింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *