ఐయామ్ రూల్స్ బ్రేకర్.!. నాట్ ఫాలోవర్ …!!

స్వతంత్ర భారతదేశంలో ఎవరైన అఖరికీ పీఎం అయిన సీఎం అయిన అఖరికీ సామాన్యులైన రూల్స్ పాటించాల్సిందే. లేదు నేను రూల్స్ పాటించను అంటే చట్టఫర చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూల్స్ పాటించలేదని జైళ్లకెళ్లిన సామాన్యులున్నారు. ముఖ్యమంత్రులున్నారు. ప్రధానమంత్రులున్నారు. మంత్రులు.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు.. అఖరికి ఎంపీలు సైతం ఉన్నారు.. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి మాత్రం తనకు రూల్స్ ముఖ్యంగా కోర్టులంటే పట్టవంటూ తాజాగా మరోకసారి నిరూపించుకున్నారు.
హెచ్ సీయూ వివాదంలో సుప్రీం కోర్టు మొట్టికాయల సంగతి మరవకముందే మరో వివాదానికి తెర తీశారు . తెలంగాణ రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమీషన్ ను ప్రభుత్వం నియమించింది. కమీషన్ చైర్ పర్శన్ గా మాజీ టీడీపీ నేత కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి ని నియమించారు. సభ్యులుగా వందన,చందన,అపర్ణ,సరిత, ప్రేమలత, బీవీ కుమార్ లను సభ్యులుగా నియమించారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ చైల్డ్ హక్కుల పరిరక్షణ కమీషన్ చైర్మన్ , సభ్యులను నియమించాలంటే వారు ముందుగా బాలల హక్కుల కోసం పోరాడినవాళ్లై ఉండాలనేది ప్రాధమిక సూత్రం.

గతంలో బీఆర్ఎస్ హాయాంలో ఆ పార్టీ సీనియర్ నేత.. ప్రముఖ న్యాయ వాదైన గుడిమళ్ల రవికుమార్ ను నియమిస్తే న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆ నియమకాన్ని కొట్టీపారేసింది. అలాంటిది ఎలాంటి నియమ నిబంధనలను అనుసరించకుండా.. కోర్టుల సూచనలను పరిగణలోకి తీసుకుండా అది కూడా నాన్ లోకల్ వ్యక్తులకు ఈ కమీషన్ లో చోటు కల్పించింది. మళ్లీ కోర్టుల నుండి చిక్కుల రాకుండా రాత్రికి రాత్రే జీవో విడుదల చేసింది. అంతేకాదు ఏకంగా తెల్లారే వారిచేత ప్రమాణ స్వీకారం చేయించింది కూడా ప్రభుత్వం. చూడాలి మరి రేవంత్ రెడ్డి సర్కారు వరుస రూల్స్ బ్రేకింగ్ పై న్యాయ స్థానాలు ఎలా స్పందిస్తాయో..?
