రేవంత్ కు హారీష్ బహిరంగ లేఖ..!

 రేవంత్ కు హారీష్ బహిరంగ లేఖ..!

Loading

సన్న వడ్లకు బోనస్ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తూ ఉంది.. ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి చేతలు మాత్రం చేదుగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.48 గంటలు కాదు 48 రోజులైనా బోనస్ డబ్బులు రాలేదు.. సన్నవడ్లకు 8 లక్షల 64 వేల మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది.. సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ వ్రాసి విడుదల చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు.

లేఖ సారాంశం:

సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు అనేక హామీలను ఇచ్చారు. అందులో 2లక్షల రూపాయల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేసారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారు. ఇప్పుడేమో సన్నవడ్లకు మీరు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారు. రైతు పండించిన అన్ని పంటలకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని ఆనాడు ప్రకటించి యూటర్న్ తీసుకున్నారు. అన్ని పంటలకు బదులు కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చారు. మీ బోనస్ హామీ ఒక బోగస్ హామీగా మారిపోయింది.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,64,000 మెట్రిక్ టన్నుల దాన్యానికి సంబందించిన 432 కోట్ల రూపాయల బోనస్ చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నాయి. వరి దాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కాలేదు. రెండో పంటకు సిద్దం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వ అదికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించింది. నిన్నటికి నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో ముచ్చింతల రైతులు తమ వడ్లు అమ్మి రెండు నెలలు అయినా ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదంటూ జిల్లా కలెక్టర్ ను కలిస్తే బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నది నిజమే, ప్రభుత్వం విడుదల ఆలస్యం అవుతుందని సమాదానం ఇచ్చారు.

బహిరంగ మార్కెట్ లో 2800 రూపాయల నుండి 3000 రూపాయల ధర పలుకుతున్నా బోనస్ కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి దాన్యాన్ని విక్రయిస్తే, తమను ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అబద్దమా..? మీరిచ్చిన బాండ్ పేపర్ బూటకమా..? సమాదానం చెప్పాలి.. గౌ.శ్రీ కేసీఆర్ గారి పాలనలో రైతులంతా గుండెధైర్యంతో వ్యవసాయాన్ని పండగలా చేసారు. కానీ మీ పాలనలో వ్యవసాయం దండగలా మారి రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు .

మీ రైతు డిక్లరేషన్ లో ప్రకటించినట్లుగా 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15 వేల రూపాయల రైతుభరోసా, అన్ని పంటలకు బోనస్,కౌలు రైతులకు కూడా రైతు భరోసాను 100 రోజుల్లో అమలు చేస్తానని .. దేవుళ్ళ సాక్షిగా మీరు ప్రమాణం చేసి మాట ఇచ్చారు. కానీ 420 రోజులు పూర్తైనా ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి వారి పక్షాన తక్షణమే హామీలు అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నామన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *