హారీష్ రావు, కేటీఆర్ లు డాక్టర్ కు చూపించుకోవాలి..!
Politics : మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, కేటీ రామారావు ల మానసిక పరిస్థితి బాగోలేదు.. వారిద్దరూ సరైన వైద్యులకు చూయించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
రైతుభరోసా పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్షలకు మాజీ మంత్రులు హారీష్, కేటీఆర్ లు మాట్లాడిన మాటలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటరిస్తూ పనికిమాలినోళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడతారు.. ఆర్ఆర్ఆర్ కేవలం ఏడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిస్తే పన్నెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.
మూసీ టెండర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే లక్షన్నర కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. రైతుభరోసాపై ఇంకా విధివిధానాలే ఖరారు కాలేదు.. అప్పుడే ఏడు ఎకరాలకు మాత్రమే ఇస్తున్నారు.. ప్రభుత్వ ఉద్యోగులకు, టాక్స్ పేయర్స్ కు ఇవ్వరని ప్రచారం చేస్తున్నారు అని అన్నారు..