ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు శనివారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశమయింది.. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సుధీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది..
ఈ నిర్ణయాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే ఒక డీఏ విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు దీపావళి పండుగకు కానుకగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది..
ప్రతి నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నది..సన్న వడ్లకు రూ.500బోనస్ ఇవ్వాలని నిర్ణయం..నవంబర్ ముప్పై తారీఖులోపు కులగణనను నిర్వహించాలని ఆదేశం..మిల్లర్ల సమస్యలను పరిష్కరించడానికి ఆమోదించిన క్యాబినెట్.. నాగోల్ – ఎల్బీ నగర్,ఎల్బీ నగర్ -శంషాబాద్ మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపింది..
