తెలంగాణ రైతాంగానికి శుభవార్త

RMPs and PMPs should not use the word “doctor”.
తెలంగాణలోని రైతులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్తను తెలిపింది. ఈరోజు ఆదివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుభరోసా పై కీలక ప్రకటన చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ” త్వరలోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తాము.. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో ఆ పథకం డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
రైతుభరోసా విధివిధానాల గురించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు చేసే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మోద్దు అని కోరారు.
