ఖమ్మం వరదబాధితులకు దొరకని హెలికాప్టర్ కేరళకెళ్లిందా…?

 ఖమ్మం వరదబాధితులకు దొరకని హెలికాప్టర్ కేరళకెళ్లిందా…?

Helicopter

Loading

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో ఖమ్మం (ఉమ్మడి )జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సైతం అతలాకుతలమైన సంగతి తెల్సిందే. ఏకంగా మున్నేరు వాగు బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది ఉన్న ఓ కుటుంబాన్ని రక్షించడానికి హెలికాప్టర్ లేదు.. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాము అని జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో ఓ ప్రకటన కూడా చేశారు.

ఆ హెలికాప్టర్ రాకపోవడంతో జేసీబీ డ్రైవర్ సుభాన్ తన ప్రాణాలకు తెగించి మరి అదే జేసీబీ తో ఆ తొమ్మిది మందిని రక్షించడం వైరల్ అయింది. కేరళలో వాయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ సీనియర్ మహిళ నేత ప్రియాంకా గాంధీ నామినేషన్ ఈరోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ,కేసీ వేణుగోపాల్, మల్లిఖార్జున ఖర్గే లకు ఓ హెలికాప్టర్ లో హాజరయ్యారు ..

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఖమ్మం వరద బాధితుల కోసం దొరకని హెలికాప్టర్ వీరికోసం దొరికిందా అని ఆ హెలికాప్టర్ వీడియోను పోస్ట్ చేస్తూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అయితే ఈ హెలికాప్టర్ తెలంగాణకు చెందిందా…?. లేదా అనేది సంబంధితాధికారులు క్లారిటీవ్వాల్సి ఉంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *