రేవంత్.. చిల్లర రాజకీయాలు మానుకో…?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్పై బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా, కేసీఆర్- కేటీఆర్పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు.
ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా డాక్టర్ శ్రవణ్ అభివర్ణించారు.
“ఇది తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఒక చీప్ ప్రొపగాండా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి తక్కువ స్థాయి రాజకీయాలు చేయడం దురదృష్టకరం,” అని ఆయన విమర్శించారు.డావోస్ సమ్మిట్ 2025 లో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని క్షీణింపజేసిందని డాక్టర్ శ్రవణ్ దుయ్యబట్టారు. “అతని అస్పష్టత, అనుచిత ప్రవర్తన, మరియు పూర్తిగా సిద్దంగా లేకపోవడం తెలంగాణ ప్రతిష్ఠకు నష్టం కలిగించాయి. అంతర్జాతీయ వేదికపై అతని వేషధారణ, తప్పుడు మాటలతో పెట్టుబడుల హామీలు ఇవ్వడం, రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీశాయి,” అని పేర్కొన్నారు.
ప్రజల దృష్టిని తన వైఫల్యాల నుంచి మళ్లించడానికి రేవంత్ రెడ్డి దిగజారి రాజకీయాలను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. “పనితీరు ద్వారా చూపించాల్సిన చోట, రేవంత్ రెడ్డి ఇలాంటి చీప్ రాజకీయాల్ని అనుసరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండదని స్పష్టంగా చెప్పాలి,” అని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన నాయకత్వం అనేది కార్యాచరణతో, దూరదృష్టితో, మరియు ప్రజల సమస్యలకు పరిష్కారాలతో చూపించబడుతుందని డాక్టర్ శ్రవణ్ గుర్తు చేశారు. “ప్రజల ఆకాంక్షలకు సముచితంగా ఉండే విధంగా వాగ్దానాలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి తన దృష్టిని నిలుపుకోవాలి.
తెలంగాణ ప్రజలకు నిజాయితీ, గౌరవం, మరియు సంక్షేమంపై నిబద్ధత ఉన్న నాయకులు అవసరం” అని ఆయన స్పష్టం చేశారు.రేవంత్ రెడ్డి కుత్సిత రాజకీయాలను విడనాడి, రాష్ట్ర అభివృద్ధి కోసం గంభీరమైన ప్రయత్నాలు చేయాలని డాక్టర్ శ్రవణ్ పిలుపునిచ్చారు. “నాయకత్వం అనేది కార్యాచరణతో ప్రభావం చూపించాలి. గందరగోళాలను సృష్టించడం కాదని తేల్చి చెప్పాలి. తెలంగాణ ప్రజలు ఉత్తమ నాయకత్వాన్ని అర్హులు,” అనిడాక్టర్ శ్రవణ్ అన్నారు.