దళిత కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఘోర అవమానం

 దళిత కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఘోర అవమానం

Vemula Veeresham

Loading

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘోర అవమానం జరిగింది. నిన్న శుక్రవారం నల్గోండ (ఉమ్మడి)జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గోన్నారు. ఈ క్రమంలో మంత్రులకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను అక్కడున్న పోలీసు అధికారులు అడ్డుకున్నారు.

దీంతో తీవ్ర ఆవేశానికి గురైన ఎమ్మెల్యే వేముల వీరేశం ఎమ్మెల్యే ఎవరో… సామాన్యుడు ఎవరో కనీసం కామన్ సెన్స్ ఉండదా అంటూ తనని అడ్డుకున్న అధికారులను తిడుతూ అక్కడ నుండి వెళ్లిపోయారు.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎంత బుజ్జగించిన కానీ వినకుండా ఎమ్మెల్యే అక్కడ నుండి వెళ్ళిపోవడం విశేషం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *