సీఎం రేవంత్ రెడ్డి కి కోర్టు నోటీసులు

 సీఎం రేవంత్ రెడ్డి కి కోర్టు నోటీసులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.. ఇటీవల మే నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది…

ఆర్ఎస్ఎస్ సహకారంతో బీజేపీ 2025లో భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తుంది అంటూ బీజేపీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై  కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో కాసం.. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో రేవంత్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *