హారీష్ రావు ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..?

Guruji, you should learn from Harish Rao..!
10 total views , 1 views today
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావును టార్గెట్ చేశారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణ్ మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుపై విమర్షల వర్షం కురిపించారు.ఆయన మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు కు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వచ్చిందా..?. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బేరసాలు ఆడిన హారీష్ రావుకు అప్పుడు రాజ్యాంగం గుర్తుకు లేదా.?.
రాజ్ భవన్ లో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎక్కడున్నావు హారీష్ రావు. అప్పుడు ఏమి చేశావు. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టును తీర్పును స్వాగతిస్తామని ఆయన అన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల హైకోర్టు తీర్పు పై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” హైకోర్టు తీర్పును గౌరవిస్తాము..
రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం బీఆర్ఎస్ విజయం.ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు .ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పైవిధంగా స్పందించారు.