మంత్రులు,నేతలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

 మంత్రులు,నేతలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

Loading

ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” అధికారం ఉందని.. పదవుల్లో ఉన్నామని విర్రవీగవద్దు.

అధికారులతో మంచిగా పద్ధతిగా పని చేయించుకోవాలి. అధికారులకు వారికి తగ్గట్లు గౌరవమివ్వాలి. ఎవరూ తమ పరిధి దాటోద్దు అని” సలహా ఇచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కొన్ని సార్లు నిబంధనల ప్రకారం వెళ్తే పేద ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు.

అందుకే నియమనిబంధనలను దాటి మానవత్వంతో ఆలొచించి వారి సమస్యలను పరిష్కరించడానికి అధికారులు,మంత్రులు చొరవ చూపాలని కోరారు. అప్పుడే ఆయా సమస్యలకు పరిష్కారం దొరికి అర్హులకు ఉపశమనం కలుగుతుంది. టైం ను ఫాలొ అవ్వాలి. అప్పుడే అనుకున్న టైంకి అనుకున్న పని జరుగుతుందని సూచించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *