రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎమ్మెల్యే పొగడ్తలు

Revanth Reddy Telangana CM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై బీజేపీకి చెందిన సీనియర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన మంగళవారం వినాయక నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ట్యాంక్ బండ్ పై పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి.. నగరం నలువైపుల నుండి గణేష్ లు ట్యాంక్ బండ్ కు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు బాగున్నాయి.
పోలీసులు,మున్సిపల్ సిబ్బంది పనితీరు బాగుంది.. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్ల నుండి నిమజ్జనం వరకు అన్నింటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ఏర్పాట్లను స్వయంగా ఆయన పరిశీలించారు. రేవంత్ రెడ్డి ధర్మం గలవారు అని పొగడ్తల వర్షం కురిపించారు.
