కేటీఆర్ కు షాకిచ్చిన ఏసీబీ అధికారులు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి విచారణకు హజరైన సంగతి తెల్సిందే.
దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించారు. ఈ విచారణలో పలు ప్రశ్నలను అధికారులు సంధించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ రేసింగ్ సమయంలో వాడిన మొబైల్ ఫోన్లను తమకు అందజేయాలని కోరినట్లు తెలుస్తోంది.
అయితే విచారణకు వచ్చే క్రమంలో తాను తన మొబైల్స్ తీసుకురాలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఈనెల పద్దెనిమిదో తారీఖు లోపు ఆ సమయంలో వాడిన మొబైల్స్ ను అందజేయాలని ఆయనకు ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
