రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

bandi sanjay warns to revanth reddy
బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గవర్నర్ .. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి… ఎమ్మెల్సీ కవితకు బెయిల్ తో పాటుగా రాజ్యసభ… మాజీ మంత్రి హారీష్ రావుకు అసెంబ్లీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ ” అధికారం కట్టబెడితే కట్టుకథలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆరు గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చి వాటిని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ పాలనలో ఆడవాళ్లకు రక్షణ లేదు.. చిన్నపిల్లలను కుక్కలు పీక్కు తింటున్నయి.. హాస్టల్స్ బాగోలేవు అని విమర్శించారు.. బీఆర్ఎస్ బీజేపీలో విలీనంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదు. అదంతా అసత్య ప్రచారం..
బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది.. కేసీఆర్ కు ఏఐ సీసీ వస్తుంది.. కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ వస్తుంది.కవితకు రాజ్యసభ వస్తుంది . బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పటికి ఒకటే.. పదేండ్లలో బీఆర్ఎస్ పై వచ్చిన వ్యతిరేకత కేవలం ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పై వచ్చింది.. దేశంలో చేతకాని సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు అని ఆయన హేద్దెవా చేశారు.