మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు

 మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు

AP Minister Nara Lokesh

ఏపీ మంత్రి నారా లోకేశ్ నాయుడు రెడ్ బుక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ గురించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ ” రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమే. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు నకిలీ పత్రాలను సృష్టించి పేదల ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు.

ఐదేండ్లు అధికారాన్ని అడ్డు పెట్టుకుని కబ్జాలు దందాలు చేసిన వారిని వదిలేయాలా..?.. రేపు లిక్కర్ స్కాం పై చర్యలు ఉంటాయి. ఎల్లుండి ఇసుక మాఫియా పై ఉంటాయి. ఆ తర్వాత ప్రతి ఒక్క స్కాం పై చర్యలు ఉంటాయని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *