ఖమ్మం లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

Mallu Bhatti Vikramarka Deputy Chief Minister of Telangana
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరులో ఈరోజు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా అమృత్ 2.0 గ్రాంట్లో భాగంగా 124.48 కోట్లతో కొత్తగూడెంలో శాశ్వత మంచినీటి పథకం, 4 కోట్లతో విద్యానగర్ హైవే కు డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు .
కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కొత్తగూడెం కలెక్టరేట్లో గోదావరి వరదలు ముందస్తు చర్యలపై మంత్రుల సమీక్షా సమావేశం జరగనుంది.