నక్క తోక తోక్కిన ఆ పది మంది ఎమ్మెల్యేలు..?

 నక్క తోక తోక్కిన ఆ పది మంది ఎమ్మెల్యేలు..?

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీలీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో తొలిసారి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నారా లోకేష్, పవన్‌తో పాటు మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు తొలిసారి ఎమ్మేల్యేలుగా గెలిచారు.

ఆ పది మందితో పాటు మరో ఏడుగురు కొత్తవారికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డి తదితరులు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు కానీ.. మంత్రివర్గంలో ఎప్పుడూ చోటు దక్కించుకోలేదు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *