ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి మాగంటి గోపినాథ్.!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈరోజు ఆదివారం ఉదయం 5.45గం.లకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మాగంటి గోపినాథ్ 1963లో హైదరాబాద్ నగరంలోని హైదరగూడలో జన్మించారు.
ఓయూలో బీఏ పూర్తి చేసిన మాగంటి 1983లో దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు. తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేసిన మాగంటి , హుడా డైరెక్టర్ గా, హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018,2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్నారు.
