ప్రజాపాలన అంటే ఆడబిడ్డల జుట్టు లాగడం.. బట్టలు చింపడమా..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజాపాలనను తీసుకోస్తాము. మార్పు తీసుకకోస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరా ఆధికారంలోకి వచ్చాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ భూములను లాక్కోవద్దంటూ ధర్నాలు చేస్తున్న ఆడబిడ్డల జుట్టు పట్టి లాగడం.. వాళ్ల బట్టలు చింపడం ప్రజాపాలన అని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” నన్ను కల్సిన యూనివర్సిటీ పిల్లలు చెబుతున్నారు. అప్పుడేప్పుడో మాతో ఫుట్ బాల్ ఆడటానికి వచ్చిన మైదానం భూములతో పాటు పక్కనున్న అటవీ భూములను లాక్కుంటున్నారు .ప్రజల కోసం . హైదరాబాద్ భవిష్యత్తు తరాల కోసం అక్కడి విద్యార్థులు కొట్లాడుతున్నారు.
మీరేమో ఇంగిత జ్ఞానం లేకుండా వారిపై దాడులు చేయిస్తున్నారు. నాలుగేండ్లు పీహెచ్ డీ చేసి బయటకు వెళ్లిపోతారు. తర్వాత ఆ యూనివర్సిటీతో వాళ్లకు పని ఏముంటది. అలాంటిది వాళ్లు కొట్లాడుతున్నారు.కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా.. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ వాటర్ లేకుండా హైదరాబాద్ లో ఉన్న అటవీ ప్రాంతాలన్నీ భూములుగా చదును చేసి అమ్ముతావా అని ప్రశ్నించారు.