మీకు రైతు భరోసా డబ్బులు పడలేదా..?. అయితే ఇది మీకోసమే..!

 మీకు రైతు భరోసా డబ్బులు పడలేదా..?. అయితే ఇది మీకోసమే..!

Loading

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాటి కేసీఆర్ పాలనలో తీసుకోచ్చిన రైతు బంధు పథకం స్థానంలో పేరు మార్చి తీసుకోచ్చిన కొత్త పథకం రైతు భరోసా . ఈ పథకం కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఉకదంపుడు మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులపాలైంది. అందుకే ఇవ్వడం లేదని.. కేవలం ఆరు వేలు మాత్రమే ఇస్తున్నాము అని చెప్పేశారు. ఆ తర్వాత ఎకరాకు ఆరు వేలు అని ముందు ఎకరాలోపు ఉన్నవాళ్లు వేశారు. తాజాగా రెండు ఎకరాలల్లోపు ఉన్నవాళ్లకు జమ చేశారు. అయితే ఇక్కడ ఓ గమ్మత్తు విషయం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అసలు విషయం ఏంటంటే..? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక రైతుకు రెండెకరాల భూమి ఉన్నది. ఆ రైతుకు రైతు భరోసా జమ కాలేదు. దీంతో ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాడు. సదరు అధికారి రైతు వివరా లను వెబ్సైట్లో పరిశీలించగా, ఆ రైతుకు అసలు భూమే లేనట్టుగా చూపించింది. దీంతో ఇద్దరూ అవాక్కయ్యారు.సిద్దిపేట జిల్లాలో మరో రైతుకు ఆరు ఎకరాల భూమి ఉన్నది. వెబ్సైట్లో మాత్రం సదరు రైతుకు నాలుగు ఎక రాలు మాత్రమే ఉన్నట్టుగా చూపిస్తున్నది. వెంటనే సదరు అధికారి క్రాప్బుకింగ్ సర్వేలో పరిశీలించారు.. అయితే ఆ రైతుకు ఆరు ఎకరాలు ఉన్నట్టు చూపిందని సమాచారం.

దీంతో పాటు ఇటీవల నిర్వహించిన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్వేలోనూ పరిశీలించగా ఆ రైతు భూమి ఆ జాబితాలో లేనట్టు తెలిసింది. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన జాబితాలో పలు సర్వే నంబర్లను బ్లాక్ చేయడమే ఇందుకు కారణమని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. దీనిపై వ్యవసాయ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించగా.. కొన్ని భూములకు సంబంధించి సర్వే చేశాము.. వాటిపై అను మానంతో బ్లాక్ లో పెట్టినట్టు చెప్పారని తెలిసింది. దీంతో పాటు నిజాం కాలంనాటి భూముల విషయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వారు చెప్పినట్టు సమాచారం..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *