అవినీతికి పాల్పడి నీతులు చెబుతున్న మాజీ మంత్రి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మహిళా నాయకురాలు.. మాజీ మంత్రి విడదల రజినీపై అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐదేండ్లు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు.
ప్రజలను పీడించుకుని అవినీతి అక్రమంగా సంపాదించిన ఆమెను ప్రజల ముందు దోషిగా నిలబెడతానని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి,ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిల అండతో మంత్రిగా విడదల రజినీ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని పుల్లారావు తీవ్రంగా ఆరోపించారు.
మాజీ మంత్రి విడదల రజినీ పుట్టిన ఊరినే మర్చిపోయి మోసం చేశారు. గెలిపించిన చిలకలూరిపేట వదిలి గుంటూరు పారిపోయారు. వైసీపీ హయాంలో భూములను కబ్జా చేసి అవినీతికి పాల్పడి ఇప్పుడు నీతులు మాట్లాడితే ఎలా?’ అని ఆయన మండిపడ్డారు.
