నిన్న పాడి కౌశిక్ రెడ్డి-నేడు సునీతా లక్ష్మారెడ్డి-రేవంత్ కు దూరమవుతున్న ఆ వర్గం..?

Padi Koushik Reddy With Sunitha Laxmareddy
సహాజంగా రాజకీయంగా ఒకర్ని ఒకరూ ఎంతైన విమర్శించుకోవచ్చు.. ఒకరిపై ఒకరూ ఎన్ని ఆరోపణలైన చేసుకోవచ్చు.. పరిధులు మించి ఆరోపణలు చేసుకున్నా.. విమర్శలు చేసుకున్న కానీ ఎవరూ ఏమి అనుకోరు. ఎప్పుడైతే పరిధి దాటి దాడులకు తెగబడతారో అప్పుడు అది ఒక్కరిది కాస్తా ఓ వర్గం విబేధంగా సృష్టించబడుతుంది. అది కాస్తా ఓ కమ్యూనిటీలో తీవ్ర వ్యతిరేకత తీసుకోస్తుంది కూడా.. ఇది రాజకీయాల్లో ఉన్నవారికి వేరుగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం తెలంగాణలో అదే కన్పిస్తుంది.
ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ తన మందబలంతో దాడులకు తెగబడటం.. ఆ తర్వాత ఓ పదిరోజుల పాటు ఆ ఇష్యూనే రాష్ట్ర ఇష్యూగా మారడం మనం గమనించిందే.. ఆయా కమ్యూనిటీ గ్రూపుల్లో తప్పులుంటే విమర్శించాలి.. రాజకీయంగా ఆరోపించాలి.. ఎదుర్కోవాలి కానీ ఇలా ఓ కమ్యూనిటీకి చెందిన నేతలు మన కమ్యూనిటీకి చెందిన నేతపై దాడికి దిగడం ఎంతవరకూ కరెక్టు అని వాదనలతో ఓ పెద్ద చర్చే జరిగిందంట.. ఆ ఘటన మరిచిపోకముందే మహిళా నాయకురాలైన నర్సాపూర్ శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడికి దిగడం మరింత హేయమైన చర్యగా వారు అభివర్ణిస్తున్నారు..
పాడి కౌశిక్ రెడ్డి అంటే రాజకీయ సవాళ్లగా తీసుకున్న కానీ ఓ మహిళా ఎమ్మెల్యే ఇంటిపైకి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు దాడికి దిగడం ఆ పార్టీలోని ఆ కమ్యూనిటీకి కూడా నచ్చలేదంట.. పైన మనోడు ఉండగా తప్పులుంటే చట్టపరంగా వెళ్లాలి కానీ ఇలా మన కమ్యూనిటీకి చెందిన నేతలపై దాడులకు ఉసిగొల్పడం ఎంతవరకూ న్యాయం అని కూడా చర్చలు జరుగుతున్నాయి అంట.. రాజకీయం చేస్కోవచ్చు.. ఏ పార్టీలో అయిన ఉండోచ్చు ..
సిద్ధాంతం ఫరంగా కోట్లాడాలి తప్పా ఎలాంటి కారణం లేకుండా దాడులకు దిగడం కరెక్టు కాదని వారి వాదన అంట.ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఆ కమ్యూనిటీలో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం అంటున్నారు.. పక్క రాష్ట్రంలో ఓ కమ్యూనిటీ ఇంకొ కమ్యూనిటీని దెబ్బ తీస్తుందని ఆలోచించే ఏకమై అక్కడ అధికార మార్పిడి జరిగేలా చేశారు.. ఇక్కడ కూడా ఆ ఆలోచన రాకముందే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మార్చుకోవాలని సూచిస్తున్నారంట ఆ కమ్యూనిటీకి చెందిన పెద్ద పెద్ద నేతలు..