కాంగ్రెస్, బీజేపీలు ఒకటే అని ఒప్పుకున్న ఎంపీ రఘునందన్…?

 కాంగ్రెస్, బీజేపీలు ఒకటే అని ఒప్పుకున్న ఎంపీ రఘునందన్…?

VRS for BRS in MLC elections..! mp from medak

Loading

ఢిల్లీలోనేమో కుస్తీ.. గల్లీలోనేమో దోస్తీ అన్నట్లు బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వ్యవహరిస్తున్నారు అని పలుమార్లు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఆ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని ఇప్పటికే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న వాదన.

తాజాగా బీజేపీకి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అని నిరూపించాయని బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు, రాజకీయ వర్గాల అభిప్రాయం.. గాంధీ ఆసుపత్రిలో ఒక్క నెలలోనే యాబై మంది మృత్యువాత పడింది నిజమే.. ఆ డేటా బయటకు ఎలా వచ్చిందో ఆర్ధం కావడం లేదని గాంధీ సూపరింటెండెంట్ రాజకుమారి మాట్లాడినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతుంది.

ఆ వీడియోను పక్కకు పెట్టిన ఎంపీ రఘునందన్ రావు మీడియా మాట్లాడుతూ ” ఏదోక ఆసుపత్రిలో ఒకరిద్దరూ చనిపొతే దాన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నాయి.. పదేండ్ల పాలనలో ఇలాంటివి జరగలేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సేఫ్ జోన్ లో ఉండేలా మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ వీడియోపై నెటిజన్లు,బీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నారు..ప్రజల ప్రాణాలకంటే రఘునందన్ రావుకు రాజకీయాలే ముఖ్యం.. కాంగ్రెస్ తో దోస్తీ ప్రధానం అన్నట్లు అంటున్నారు.. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఒకటే అని మరోకసారి ఒప్పుకుంటున్నారు అని విరుచుకుపడుతున్నారు..

బీఆర్ఎస్ పాలనలో చీమ చిటుక్కుమన్న విరుచుకుపడే రఘునందన్ రావు ఇప్పుడు యాబై మందిదాక చనిపొతే జరుగుతాయి.. ఇలాంటివి పట్టించుకుంటరా అని మద్ధతుగా మాట్లాడటం బాధాకరం అని రాజకీయ విమర్శకులు రఘునందన్ పై విరుచుకుపడుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *