ఖమ్మం వరదలకు అసలు కారణం ఇదే..?

 ఖమ్మం వరదలకు అసలు కారణం ఇదే..?

Khammam Floods

Loading

తెలంగాణ ఏపీ రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన ఖమ్మం పట్టణం వరదలతో అతలాకుతలమైన సంగతి తెల్సిందే.. వరదలకు ఖమ్మం నగరమంతా మునిగిపోయి కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా జిల్లా స్థానిక మంత్రులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,భట్టి విక్రమార్క మల్లు జిల్లాలోనే ఉండి వరద బాధిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

అయితే గతంలో ముప్పై ఆరు అడుగుల వరద వచ్చిన కానీ మునగని ఖమ్మం నేడు చిన్నపాటి వరదకే ఖమ్మం అంతా మునిగిపోయింది. అయితే దీని వెనక ఉన్న అసలు కారణం ఇదే అని నిపుణులు చెబుతున్నారు. ఖమ్మం పట్టణానికి అనుకుని ఉన్న మున్నేరు నది బఫర్ ,FTl పరిధిలో అక్రమ నిర్మాణాలు.. కట్టడాలు చేపట్టడంతోనే చాలా చోట్ల వరదలకు గురైంది.

గతంలో ముప్పై ఆరు అడుగుల వరద ప్రభావం వచ్చిన ఖమ్మం తాకలేదు కానీ ఈసారి మాత్రం తక్కువ సమయంలోనే వందలాది ఇల్లు ధ్వంసమయ్యాయి. ఏకంగా ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీళ్లు రావడం విశేషం. మరోవైపు చెరువులను,నాలాలను పూడ్చి వేసి వాటి స్థానంలొ వెంచర్లు,పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు. దీంతో అవి కుంచించుకుపోయి వరద ప్రవాహాం ఖమ్మం నగరాన్ని ముంచేసింది అని నిపుణులు చెబుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *