టూరిజం స్పాట్ గా వరంగల్..!

Minister Konda Surekha
వరంగల్ లో టూరిజం డెవలప్ మెంట్ కి మంచి అవకాశాలున్నాయని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని ఒక మంచి టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేయాలని సీఎంను కోరారు.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రాణి రుద్రమ దేవి, సమ్మక్క-సారక్క లాంటి గొప్పగొప్ప మహిళా మణులు ఏలిన గడ్డ ఈ వరంగల్ అని ఆమె గుర్తు చేశారు.
అయితే, ఇక్కడ ఏం చేయాలన్న ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారు కొంచం సహకరించడం లేదని సీఎం దృష్టికి మంత్రి సురేఖ తీసుకెళ్ళారు. ఈ విషయంపై దృష్టి సారించాలని సీఎంను మంత్రి సురేఖ కోరారు. రేవంతన్న మాట ఇస్తే తప్పరని…. పాత వరంగల్ ను కొత్తగా… సరికొత్తగా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హామీలు నేరవేరుస్తూ ముందుకు వెళ్ళుతున్నారని కితాబిచ్చారు.
నిన్న రేవంతన్న అసెంబ్లీలో ఇచ్చిన స్పీచును చూస్తే, కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఏం చేస్తుందో… ఏం చేయాలనుకుంటుందో అందరికీ అర్థం అవుతుందని స్పష్టం చేశారు. ఎయిర్ పోర్టు, టెక్సటైల్ పార్కు కూడా త్వరలో రాబోతున్నాయని… వీటి కోసం రేవంతన్న ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం వెంట తాము అందరం ఉంటామని మంత్రి సురేఖ పునరుద్ఘాటించారు.
