ఆ 4గుర్కి మంత్రి పదవులు ఖాయం ..!

Revanth Reddy Anumula
ఏఫ్రిల్ మూడో తారీఖున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఆ నలుగుర్కి బెర్తులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత ..ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దాదాపు బెర్తు ఖరారైనట్లు తెలుస్తుంది.
ఇక బీసీల విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి కూడా మంత్రి పదవి దాదాపు ఖాయమైంది.మరోవైపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కూడా మంత్రిగా పదోన్నతి కల్పించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరిన ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే.. మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖాయమైంది. ఇదే జిల్లా నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుని పార్టీ కోసం పెద్ద ఎత్తున డబ్బు లు ఖర్చు పెట్టిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును బుజ్జగించి క్యాబినెట్ హోదా ఉన్న పదవి ఇవ్వనున్నారు.
