బీఆర్ఎస్ పాలనతో ఓ జనరేషన్ భవిష్యత్తు నాశనం..!

 బీఆర్ఎస్ పాలనతో ఓ జనరేషన్ భవిష్యత్తు నాశనం..!

Loading

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను బీఆర్ఎస్  నాశనం చేసిందని ఆర్థిక శాఖ మంత్రి..ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డా రు. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్  ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో  ఆయన పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు.

దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ముందే లాక్కుంది’ .వాళ్ల హయాంలో జీఎస్టీ వృద్ధి రేటు 8.54 ఉంటే తమ హయాంలో 12.3 శాతంగా ఉందని  తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

‘ఆరు గ్యారంటీలకే రూ.56 వేల కోట్లు ఖర్చు పెడతాం. బడ్జెట్ను కుదించి వాస్తవ లెక్కలు చెప్పాం. చేయగలిగివే మేం బడ్జెట్లో పొందుపరిచాము. పదేళ్లలో రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్  ఏం సాధించింది?’ అని భట్టీ పేర్కొన్నారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *