తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.!

anumula revanth reddy
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో కీలక సమావేశమైంది.
ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు రిజర్వేషన్ల అమలుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత రిజర్వేషన్ల అమలుపై ఆర్డినెన్స్ సైతం తీసుకురానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సుధీర్ఘంగా భేటీ కొనసాగుతుంది.