మంత్రివర్గ విస్తరణ -6 బెర్తులకు పోటీలో 30మంది..!

Telangana Cabinet Expansion
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఉగాది రోజు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకెళ్లిన సంగతి తెల్సిందే.ఈ పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్ నేతలైన కేసీ వేణు గోపాల్, మల్లిఖార్జున ఖర్గే లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క , పీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ పోస్టుల భర్తీ లాంటి పలు అంశాల గురించి చర్చించారు. నేడే రేపో ఎప్పుడైన మంత్రివర్గ జాబితాను విడుదల చేసే అవకాశముంది.
రూల్స్ ప్రకారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకొనే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. ఇంకో ఆరుగురికి అవకాశం ఉన్నది. ఈ ఆరు పదవులకు 30 మంది పోటీ పడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మంత్రి పదవి ఆశిస్తున్నవారంతా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టారు. పోటీలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, విజయశాంతి, అమీర్అలీఖాన్, సుదర్శన్రెడ్డి, ప్రేమ్సాగర్రావు పేర్లు ముందు వరుసలో ఉన్నట్టు తెలిసింది. మంత్రి పదవులతోపాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ల ఎంపికను కూడా అధిష్ఠానం పూర్తి చేసే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
మంత్రి పదవులతోపాటు పార్టీ పదవుల భర్తీలో రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నివేదికల ఆధారంగానే అధిష్ఠానం భర్తీలు చేపడుతున్నట్టు తెలిసింది.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో జిల్లా నుంచి సీనియర్ నేతలు ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ, మానాల మోహన్రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, వెడ్మ బొజ్జు పోటీలో ఉన్నారు.కరీంనగర్ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, మక్కన్సింగ్ఠాకూర్ ఉన్నారు.వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవి కో సం పోటీ తీవ్రంగా ఉన్నది. రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి పోటీలో ఉన్నారు.
ఖమ్మం నుంచి ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్గంలో ఉండటంతో ఇక్కడ కాంగ్రెస్ నుంచి కాకుండా మిత్రపక్షం సీపీఐ నుంచి ఒత్తిడి వస్తున్నట్టు తెలిసింది.నల్లగొండ నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి మంత్రులుగా లతో పాటు ఇదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, బాలూనాయక్, బీర్ల ఐలయ్య పోటీలో ఉన్నట్టు తెలిసింది.మహబూబ్నగర్ నుంచి ముఖ్యంగా ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, యెన్నం శ్రీనివాస్రెడ్డి పోటీలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకు ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మంత్రి పదవి కోసం మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కమ్మ సామాజికవర్గానికి చెందిన అరికెపూడి గాంధీకి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయిన మైనార్టీ నేతలు ఫిరోజ్ఖాన్, అజాహరుద్దీన్ మంత్రి పదవి కోసం పోటీపడుతున్నట్టు తెలిసింది.మెదక్ జిల్లా నుంచి ప్రస్తుతం దామోదర రాజనర్సింహ ఒక్కరే మంత్రిగా ఉండగా, సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తనను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అధిష్ఠానాన్ని కోరుతున్నట్టు తెలిసింది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ను మంత్రిని చేసేందుకు ఆయన తండ్రి మై నంపల్లి హన్మంతరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
