పోలవరం ప్రాజెక్టు కు సహకరించండి

3 total views , 1 views today
దేశంలో ఆరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే జాతీయ ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని, లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అయన మాట్లాడుతూ 2019 నాటికి సివిల్ పనులు 71.93%, భూసేకరణం పునరావాసం పనులు 18.66% పనులు పూర్తయ్యాయి.
కానీ గత ఐదెండ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో సివిల్ పనులు 3.84% సేకరణ పనులు 3.89% మాత్రమే జరిగాయని సభ దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ను తిరిగి ట్రాక్లోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అయన తెలిపారు.