రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సింగిరెడ్డి సెటైర్లు

 రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సింగిరెడ్డి సెటైర్లు

రుణమాఫీ కోసం ఆరువేల ఎనిమిదివందల కోట్ల నిధులను విడుదల చేస్తున్నాము..ఒక్కరోజే లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నాము..దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సెటైర్లు వేస్తూ ఆగ్రహాం వ్యక్తం చేశారు..ఎక్స్ వేదికగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ గతంలో కేసీఆర్ గారు మొదటి విడతగా లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయడానికి 17వేల కోట్ల రూపాయలను 37లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు.

మరి ఇప్పుడు లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి విడుదల చేసిన ఆరువేల ఎనిమిది వందల కోట్లను  పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎలా జమచేస్తున్నారు..?. లక్ష లోపు రుణాలున్నవారు పదకొండు లక్షలమందే ఉంటారా..?.. రైతులను మోసం చేస్తూ మీరు పబ్లిసిటీ స్టంట్ల్ వేస్తున్నారా అని సెటైర్లు వేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *